Sensex: అమ్మకాల ఒత్తిడి.. కుప్పకూలిన మార్కెట్లు

  • 1,045 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 331 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 6.32 పాయింట్లు నష్టపోయిన టాటా స్టీల్ షేర్ విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు విలవిల్లాడాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,045 పాయింట్లు కోల్పోయి 51,495కి పడిపోయింది. నిఫ్టీ 331 పాయింట్లు నష్టపోయి 15,360కి దిగజారింది. మెటల్ సూచీ ఏకంగా 5.69 శాతం పతనమయింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-6.32%), టెక్ మహీంద్రా (-4.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.34%), విప్రో (-4.12%), భారతి ఎయిర్ టెల్ (-3.99%). 

సెన్సెక్స్ లో కేవలం నెస్లే ఇండియా (-0.36%) మాత్రమే లాభపడింది.

More Telugu News