Chiranjeevi: బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'కు చిరంజీవి వాయిస్ ఓవర్

  • రణబీర్ కపూర్, అలియా జంటగా 'బ్రహ్మాస్త్ర'
  • అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చిత్రం
  • కీలకపాత్ర పోషిస్తున్న నాగార్జున
  • రెండు భాగాలుగా వస్తున్న 'బ్రహ్మాస్త్ర'
Chiranjeevi lends his voice for Brahmastra

బాలీవుడ్ లో అతి భారీ బడ్జెట్ చిత్రంగా ప్రచారంలో వున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. 'బ్రహ్మాస్త్ర' చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తెలుగులో 'శివ' పేరుతో ఫస్ట్ పార్ట్ విడుదల చేయనున్నారు. 

కాగా, ఈ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా భాగమయ్యారు. ఈ సినిమా కోసం చిరు వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ మేరకు 'బ్రహ్మాస్త్ర' యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో చిరంజీవి సరికొత్త హెయిర్ స్టయిల్ తో దర్శనమివ్వడం విశేషం. ఈ సినిమా ట్రైలర్ జూన్ 15న లాంచ్ చేయనున్నారు.

More Telugu News