Hyderabad: ‘అంటే.. సుందరానికీ’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై కేసు

  • ఈ నెల 9న శిల్పకళా వేదికలో ప్రి రిలీజ్ ఈవెంట్
  • ఎక్కడా కరోనా నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు
  • మైత్రీతో పాటు శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీసుల కేసు
Madapur Police Files A Case Against Mythri Movie Makers

‘అంటే.. సుందరానికీ..’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో నడుస్తోంది. నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా నిన్ననే విడుదలైంది. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే, ఆ చిత్ర నిర్మాణ సంస్థలపై హైదరాబాద్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. 

ఈ నెల 9న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే, ఎక్కడా కరోనా నియమాలను పాటించలేదని మైత్రీ మూవీ మేకర్స్, కార్యక్రమ నిర్వహణ సంస్థ శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News