Rahul Gandhi: ఇది సిగ్గుమాలిన మతోన్మాదం: రాహుల్ గాంధీ

  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు వివాదాస్పదం
  • బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్, నవీన్ జిందాల్
  • ముస్లిందేశాల నుంచి భారత్ కు విమర్శల సెగ
  • భారత్ బలహీనపడుతుందన్న రాహుల్
Rahul Gandhi slams center on recent developments

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని పేర్కొన్నారు. 'ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు... కానీ భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతోంది. ఇలాంటి సిగ్గుమాలిన మతోన్మాదం మనలను ఏకాకులను చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువును కూడా మంటగలుపుతోంది' అని రాహుల్ గాంధీ విమర్శించారు.

More Telugu News