Nisar Khanday: జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్... హిజ్బుల్ కమాండర్ ను హతమార్చిన భద్రతా బలగాలు

  • అనంత్ నాగ్ జిల్లా రిషిపొరాలో ఎదురుకాల్పులు
  • హిజ్బుల్ కమాండర్ నిసార్ ఖండే మృతి
  • ముగ్గురు జవాన్లకు గాయాలు
  • ఎన్ కౌంటర్ కొనసాగుతోందన్న ఐజీ 
Security forces killed HM Commander in Anantnag districts

జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కమాండర్ ను కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికులతో పాటు ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని తెలిపారు. క్షతగాత్రులను వాయు మార్గంలో శ్రీనగర్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. 

కాగా, మరణించిన హిజ్బుల్ కమాండర్ ను నిసార్ ఖండేగా గుర్తించారు. ఈ సందర్భంగా ఓ ఏకే-47 రైఫిల్ ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.

More Telugu News