Anand Mahindra: ప్రాచీన తమిళ అక్షరాలతో ఆనంద్ మహీంద్రా చిత్తరువు... తమిళంలో బదులిచ్చిన వ్యాపారవేత్త

  • 741 అక్షరాలతో ఆనంద్ మహీంద్రా బొమ్మ
  • ఆచ్చెరువొందిన వ్యాపారవేత్త
  • చిత్రకారుడికి అభినందనలు
  • ఆ చిత్రాన్ని తన ఇంట్లో ఉంచుకుంటానని వెల్లడి
Tamilnadu man portraits Anand Mahindra with ancient Tamil letters

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి సోషల్ మీడియాలో స్పందించారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గీసిన తన చిత్రాన్ని చూసి ఆయన అచ్చెరువొందారు. కాంచీపురంకు చెందిన గణేశ్ అనే వ్యక్తి ప్రాచీన తమిళ అక్షరాలతో ఆనంద్ మహీంద్రా బొమ్మను గీయడం విశేషం. ఈ క్రమంలో గణేశ్ 741 అక్షరాలను ఉపయోగించారు. ఈ విధంగా అక్షరాలను ఉపయోగించి చిత్రించడం ఇదే ప్రథమం అని ఆ వ్యక్తి తెలిపారు. ఈ బొమ్మపై మీ స్పందన తెలుసుకోవాలనుందని ఆనంద్ మహీంద్రాను కోరారు. 

తమిళ ప్రాచీన అక్షరాలతో కొత్త తరహాలో ఉన్న తన చిత్రాన్ని చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. నిజంగా అద్భుతం అని కితాబిచ్చారు. తన బొమ్మ గీసిన ఆ చిత్రకారుడ్ని అభినందిస్తున్నానని తెలిపారు. తమిళ భాష గొప్పదనాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ చిత్రకారుడ్ని అభినందిస్తూ ఆ బొమ్మను తన నివాసంలో ఉంచుతానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు.

More Telugu News