Andhra Pradesh: ముంద‌స్తు బెయిల్ కోసం నారాయ‌ణ కుమార్తెలు, అల్లుడి పిటిష‌న్లు... రేపు హైకోర్టు నిర్ణ‌యం

  • హైకోర్టును ఆశ్ర‌యించిన శ‌ర‌ణి, సింధూరి, పునీత్‌
  • మూడు రోజుల క్రితం హౌజ్ మోష‌న్ పిటిష‌న్లు దాఖ‌లు
  • వాద‌న‌లు పూర్తి... తీర్పు రేప‌టికి వాయిదా
ap high court adjourns ex minister narayana daughters and niece bail petitions

ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో ముంద‌స్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి నారాయ‌ణ కుమార్తెలు శ‌ర‌ణి, సింధూరిల‌తో పాటు ఆయ‌న అల్లుడు పునీత్ కూడా ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసులో త‌మ‌ను అరెస్ట్ చేయ‌కుండా ఉండేలా ఉత్త‌ర్వులు ఇవ్వాలంటూ వారు మూడు రోజుల క్రితం హైకోర్టులో హౌజ్ మోష‌న్ పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ల‌పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు... నిందితుల‌పై ఎలాంటి దుందుడుకు చ‌ర్య‌ల‌కు దిగ‌రాదంటూ హైకోర్టు ఏపీ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే... ఈ పిటిష‌న్ల విచార‌ణ‌లో భాగంగా నిందితుల త‌రఫు న్యాయావాది వాద‌న‌ల‌తో పాటు ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు బుధ‌వారం పూర్తయ్యాయి. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు ఈ పిటిష‌న్ల‌పై త‌న నిర్ణ‌యాన్ని రేపు (గురువారం) వెల్ల‌డిస్తాన‌ని తెలిపింది. విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది.

More Telugu News