Hyderabad: అమ్మాయి ప్రేమ విష‌యంలో గొడ‌వ‌.. ఇంట‌ర్ విద్యార్థిని క‌త్తితో పొడిచి చంపిన తోటి విద్యార్థి

  • హైద‌రాబాద్, రాజేంద్ర న‌గ‌ర్ ప‌రిధిలోని అత్తాపూర్ లో ఘ‌ట‌న
  • బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాలేజీలో చ‌దువుతోన్న‌ ముగ్గురు విద్యార్థులు 
  • వారిలో ఇద్ద‌రు ఒకే అమ్మాయిని ప్రేమిస్తోన్న వైనం
  • మూసీకాలువ వ‌ద్ద‌కు వెళ్లి మాట్లాడుకుని దాడి
boy kills his friend in hyderabd

అమ్మాయి ప్రేమ విష‌యంలో గొడ‌వ ప‌డి ఇంట‌ర్ విద్యార్థిని క‌త్తితో పొడిచి చంపాడు తోటి విద్యార్థి. అంతేకాదు, బాధిత విద్యార్థి క‌డుపులో నుంచి ర‌క్తం కారుతుండ‌గా అతడితో సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్, రాజేంద్ర న‌గ‌ర్ ప‌రిధిలోని అత్తాపూర్ లో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 

రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు.. ఆ త‌ర్వాత ఈ కేసును బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు బ‌దిలీ చేశారు. బాలుడిని క‌త్తితో పొడిచిన విద్యార్థితో పాటు మరొక బాలుడిని కూడా పోలీసులు ప‌ట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు ఇంట‌ర్ చ‌దువుతున్నారు. 

వారిలో ఇద్ద‌రు ఒకే అమ్మాయిని ప్రేమించారు. దీంతో వారు అత్తాపూర్ లోని మూసీకాలువ వ‌ద్ద‌కు వెళ్లి మాట్లాడుకున్నారు. ఆ స‌మ‌యంలో ఓ విద్యార్థి త‌న స్నేహితుడితో క‌లిసి ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం క‌త్తి కూడా తీసుకొచ్చాడు. తాను ప్రేమిస్తోన్న అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావంటూ విద్యార్థిని పొడిచి త‌న స్నేహితుడితో క‌లిసి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

More Telugu News