Corona Virus: తెలంగాణలో అత్యంత కనిష్ఠ స్థాయిలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

  • గత 24 గంటల్లో 13,930 కరోనా టెస్టులు
  • 38 మందికి పాజిటివ్ గా నిర్ధారణ 
  • హైదరాబాదులో 27 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 42 మంది
  • ఇంకా 370 మందికి చికిత్స
Corona bulletin of Telangana

తెలంగాణలో భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, రోజువారీ కేసులు 50కి లోపే నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 13,930 శాంపిల్స్ పరీక్షించగా, 38 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 27 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 42 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్త మరణాలేవీ నమోదు కాలేదు. 

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,92,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,184 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 370 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

More Telugu News