NTR: నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రారంభించనున్న బాలకృష్ణ

  • మే 28న ఎన్టీఆర్ జయంతి
  • ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలు
  • ప్రారంభోత్సవానికి హాజరుకానున్న బాలకృష్ణ
  • శతజయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న అభిమానులు
Balakrishna will launch NTR centenary birthday celebrations

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది పొడవునా రాష్ట్రంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చేపట్టనున్నారు. 

మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని, ఆయన స్వస్థలం నిమ్మకూరులో శతజయంతి వేడుకల ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుకలను ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు, తెనాలిలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా బాలయ్య హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ వేడుకల కోసం అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News