Chhattisgarh: కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల దుర్మరణం!

  • ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఘోర ప్రమాదం
  • ల్యాండ్ చేస్తుండగా హెలికాప్టర్ లో చెలరేగిన మంటలు
  • ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదం
Helicopter Crash In Chhattisgarh Raipur 2 Pilots Dead

ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి స్వామి వివేకానంద ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవలు దుర్మరణం చెందారు. 

ఈ ప్రమాదం గురించి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ, నిన్న రాత్రి 9.10 గంటల సమయంలో ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. హెలికాప్టర్ ను ల్యాండ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయారని... ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఇతర ప్రయాణికులు ఎవరూ లేరని వెల్లడించారు. 

అయితే ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై డీజీసీఏ, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించాయి. ఈ ప్రమాదం పట్ల ఛత్తీస్ గఢ్ సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన పైలట్లకు సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

More Telugu News