Sarkaru Vaari Paata: 'దిష్టి తీయించుకోవాలి'..‘సర్కారు వారి పాట’ సినిమాపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

  • సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు టైమింగ్ అద్భుతమ‌న్న హ‌రీశ్
  • సినిమా చూస్తే గొప్ప అనుభూతిని పొంద‌వ‌చ్చ‌ని ట్వీట్
  • ప‌రశురాం ఈ సినిమా క‌థను రాసుకున్న తీరుపై ప్ర‌శంస‌లు
Harish Shankar praises sarkaru vaari paata

పరశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ చిత్రం ‘సర్కారు వారి పాట’ ఈ రోజు విడుద‌లైంది. ఈ సినిమాను చూసిన ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు స్టయిలిష్‌ ప్ర‌ద‌ర్శ‌న, టైమింగ్ అద్భుతంగా ఉన్నాయ‌ని చెప్పారు. ‘సర్కారు వారి పాట’ సినిమా చూస్తే గొప్ప అనుభూతిని పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు.

ప‌రశురాం ఈ సినిమా క‌థను రాసుకున్న తీరు, ఈ సినిమాలోని కీల‌క‌ పాత్ర‌ల‌ను అద్భుతంగా చూపించిన తీరుకు అభినంద‌న‌లు చెబుతున్నాన‌ని హ‌రీశ్ శంక‌ర్ పేర్కొన్నారు. మైత్రీ మూవీస్ వారు ఈ సారి దిష్టి తీయించుకోవాల‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. కాగా, ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేశ్ బాబు స‌ర‌స‌న‌ కీర్తి సురేశ్ నటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.  

More Telugu News