Eluru: కేజీఎఫ్‌-2 సినిమా చూస్తూ వ్య‌క్తి మృతి.. కేసు న‌మోదు

  • ఏలూరులోని థియేట‌ర్లో ఘ‌ట‌న
  • ఆసుప‌త్రికి మృత దేహం త‌ర‌లింపు
  • కార‌ణ‌మేమిట‌న్న దానిపై రాని స్ప‌ష్ట‌త‌
a man died in the kgf 2 cinema theatre

భార‌తీయ సినిమా వ‌సూళ్ల‌లో స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్న కేజీఎఫ్‌-2 సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు సంబంధించి సోమ‌వారం ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏపీలోని ఏలూరు న‌గ‌రంలో ఈ సినిమా చూస్తూ ఓ వ్య‌క్తి థియేట‌ర్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన థియేట‌ర్‌కు చేరుకుని మృత‌దేహాన్ని శ‌వ ప‌రీక్ష కోసం ఏలూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. సినిమా చూస్తుండ‌గా... ఆ వ్య‌క్తి ఏ కార‌ణంతో చ‌నిపోయాడన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

More Telugu News