Andhra Pradesh: ఏపీ ప్ర‌భుత్వానికి దేవి సీఫుడ్స్‌, అవంతి గ్రూప్‌ల రూ.4 కోట్ల విరాళం

  • నాడు- నేడుకు విరాళాలు
  • రూ.2 కోట్ల చొప్పున అందించిన రెండు సంస్థ‌లు
  • సీఎం జ‌గ‌న్‌కు డీడీలు అంద‌జేసిన సంస్థ‌ల ఎండీలు
devi sea foods amd avanthi group donates 2 crore each to ap governmnet

ఏపీ ప్ర‌భుత్వానికి సోమ‌వారం రెండు సంస్థ‌ల నుంచి రూ.4 కోట్ల విరాళం అందింది. నాడు- నేడులో భాగంగా పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప్ర‌భుత్వం చేప‌డుతున్న మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నకు తోడ్పాటు అందించేందుకే ఈ విరాళాలు అందాయి. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్‌కు దేవి సీ ఫుడ్స్‌, అవంతి గ్రూప్‌లు రూ.2 కోట్ల చొప్పున డీడీలు అంద‌జేశాయి. 

కనెక్ట్‌ టూ ఆంధ్ర, ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ పేరిట తీసిన ఈ డీడీల‌ను దేవి సీ ఫుడ్స్‌ ఎండీ పోట్రు బ్రహ్మనందం, అవంతి గ్రూప్‌ సీఎండీ అల్లూరి ఇంద్రకుమార్‌లు సీఎం జ‌గ‌న్‌కు సోమ‌వారం తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో అంద‌జేశారు.

More Telugu News