Chiranjeevi: త‌ల్లితో చిరు, నాగ‌బాబు, ప‌వ‌న్ తీసుకున్న వీడియో వైర‌ల్

  • మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా పోస్ట్ చేసిన చిరు
  • త‌మ త‌ల్లితో కలిసి భోజ‌నం చేసిన అన్న‌ద‌మ్ములు
  • త‌ల్లికి గొడుగు ప‌ట్టిన చిరంజీవి
chiranjeevi shares a video

మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న త‌ల్లికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో చిరంజీవి త‌మ్ముళ్లు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కూడా ఉన్నారు. త‌మ త‌ల్లితో కలిసి భోజ‌నం చేస్తూ చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇందులో క‌న‌ప‌డ్డారు. త‌న త‌ల్లికి చిరంజీవి గొడుగుప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా త‌మ త‌ల్లితో ముగ్గురు అన్న‌ద‌మ్ములు ఫొటోలు దిగారు. 

ఈ సంద‌ర్భంగా అమ్మలందరికీ అభివందనములు. మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ త‌ల్లుల‌ను గుర్తు చేసుకుంటూ మాతృ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

More Telugu News