BJP: ద‌త్త‌త గ్రామం వెళుతుంటే టీఆర్ఎస్ అడ్డ‌గింత‌... కమిషనర్ కార్యాలయం ముందు ఎంపీ అరవింద్ బైఠాయింపు

  • కుకునూర్‌ను ద‌త్త‌త తీసుకున్న అర‌వింద్‌
  • ప‌నుల ప‌ర్యవేక్ష‌ణ కోసం గ్రామానికి ప‌య‌నం
  • వేల్పూర్ క్రాస్ వ‌ద్ద అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు
  • పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ 
bjp mp arvind stage dharna before police commissioner office

బీజేపీ యువ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ టీఆర్ఎస్ శ్రేణుల అడ్డ‌గింత‌తో న‌డిరోడ్డుపైనే బైఠాయించారు. దీంతో నిజామాబాద్ ప‌రిధిలోని వేల్పూర్ క్రాస్ రోడ్డు వ‌ద్ద శ‌నివారం సాయంత్రం హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా నిజామాబాద్ పోలీసుల తీరుపైనా, ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని నిజామాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌పైనా అర‌వింద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... నిజామాబాద్ ప‌రిధిలోని కుకునూర్ గ్రామాన్ని అర‌వింద్ ద‌త్త‌త తీసుకున్నారు. త‌న‌కు వ‌చ్చే ఎంపీల్యాడ్స్‌తో ఆ గ్రామంలో అభివృద్ధి ప‌నులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ్రామంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు అర‌వింద్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కుకునూర్ బ‌య‌లుదేరారు. 

వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద‌కు రాగానే...ఆయ‌న‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో నిజామాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఈ విష‌యం తెలియ‌జేసిన అర‌వింద్ టీఆర్ఎస్ శ్రేణుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని కోరారు. అయితే పోలీసుల నుంచి ఎంత‌సేప‌టికీ స్పంద‌న రాక‌పోవ‌డంతో క‌మిష‌న‌ర్ వైఖ‌రిని నిర‌సిస్తూ నేరుగా కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్లిన అర‌వింద్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి బైఠాయించారు.

More Telugu News