poonam kaur: 'ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన డ్యామేజ్ ఇక చాలు' అంటూ ఇద్ద‌రు పిల్ల‌ల‌తో దిగిన ఫొటోపై పూన‌మ్ కౌర్ క్లారిటీ

  • ఇటీవ‌ల ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఫొటో దిగి పోస్ట్ చేసిన పూనమ్ కౌర్
  • పూన‌మ్ కౌర్‌కి పెళ్లయి పిల్ల‌లు ఉన్నార‌ట అంటూ కొంద‌రు పోస్టులు
  • ఆ ఫొటోలో ఉన్న‌ది త‌న స్నేహితుల పిల్ల‌ల‌ని తెలిపిన కౌర్
poonam kaur tweet goes viral

సామాజిక మాధ్య‌మాల్లో సినీ నటుల‌పై ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతుంటాయి. దీంతో ఆయా న‌టీన‌టులు ఇబ్బందులు ప‌డుతుంటారు. త‌మ‌పై వ‌స్తోన్న వదంతుల‌పై స్వ‌యంగా స్పందించి క్లారిటీ ఇచ్చుకోవాల్సి వ‌స్తోంది. ఇక, సినీ న‌టి పూనమ్ కౌర్ ఇటీవ‌ల ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఫొటో దిగి పోస్ట్ చేసింది. దీంతో పూన‌మ్ కౌర్‌కి పెళ్లయి పిల్ల‌లు ఉన్నార‌ట అంటూ సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు పోస్టులు చేశారు. 

ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసిన పూన‌మ్ కౌర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 'భరించలేని విధంగా ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన డ్యామేజ్ ఇక చాలు' అని ఆమె పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఉన్న‌ది త‌న స్నేహితుల పిల్ల‌ల‌ని తెలిపింది. దీనిపై స్ప‌ష్టత నిచ్చే అవ‌కాశం ఇచ్చినందుకు సోష‌ల్ మీడియాకు థ్యాంక్స్ అంటూ ఆమె పేర్కొంది.

More Telugu News