IPL 2022: టాస్ గెలిచిన ధోనీ... ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

  • బెంగ‌ళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ధోనీ
  • పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో బెంగ‌ళూరు
  • దిగువ నుంచి రెండో స్థానంలో కొన‌సాగుతున్న చెన్నై
csk won the toss and chosetofield fisrt

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) తాజా సీజ‌న్‌లో భాగంగా బుధ‌వారం రాత్రి జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో మ‌హేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. పూణేలోని మ‌హారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ధోనీ... బెంగ‌ళూరు జ‌ట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 

పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై.. వ‌రుస ఓట‌ముల‌తో సిరీస్ మ‌ధ్య‌లోనే కెప్టెన్సీని జ‌డేజా నుంచి ధోనీకి అప్ప‌గించింది. ఇప్ప‌టిదాకా 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై... 3 మ్యాచ్‌లు మాత్ర‌మే నెగ్గింది. ధోనీ కెప్టెన్సీ ప‌గ్గాలు తిరిగి చేప‌ట్టిన త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ విక్ట‌రీని న‌మోదు చేసింది. మ‌రి నేటి మ్యాచ్‌లో ధోనీ మార్కు కెప్టెన్సీతో మ‌రో విజ‌యాన్ని ఆ జ‌ట్టు న‌మోదు చేస్తుందా?  లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇదిలా ఉంటే... మునుప‌టి సీజ‌న్ల కంటే ఈ సీజ‌న్‌తో ఓ మోస్త‌రు ఆట తీరును ప్ర‌ద‌ర్శిస్తున్న బెంగ‌ళూరు జ‌ట్టు ఇప్ప‌టిదాకా 10 మ్యాచ్‌లు ఆడ‌గా.. 5 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టికలో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు మెరుగుప‌డే ఛాన్సుంది. ఈ నేప‌థ్యంలో చెన్నైతో జ‌ర‌గ‌నున్న నేటి మ్యాచ్ బెంగ‌ళూరుకు కీల‌కం కానుంది.

More Telugu News