IPL 2022: ఐపీఎల్ ఫైనల్ అహ్మ‌దాబాద్‌లో!... క్వాలిఫ‌య‌ర్ 1, ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లు ఈడెన్ గార్డెన్స్‌లో!

  • 29న న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్‌
  • 27న క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ కూడా అక్క‌డే
  • ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫ‌య‌ర్ 1, ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లు
ipl 2022 finals in narendra modi stadium in ahmedabad

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ (ఐపీఎల్‌) లీగ్ తాజా సీజ‌న్‌లో మ్యాచ్‌ల‌న్నింటినీ మ‌హారాష్ట్రలోని స్టేడియంలలోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా బీసీసీఐ గ‌తంలో ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ను కాస్తంత మారుస్తూ తాజాగా బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ప్లే ఆఫ్ మ్యాచ్‌ల‌ను గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌, ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తాలో నిర్వ‌హించ‌నున్నారు.

ఐపీఎల్ తాజా సీజన్‌లో ప్లే ఆఫ్ ద‌శ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ మంగ‌ళ‌వారం ఈ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. ఈ సీజన్‌లో ఈ నెల 29న జ‌ర‌గ‌నున్న టైటిల్ పోరును అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో నిర్వ‌హించ‌నుండ‌గా... అంత‌కు ముందే ఈ నెల 27న క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌నూ ఇక్క‌డే నిర్వ‌హిస్తారు. ఇక కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్ (మే 24)తో పాటు ఎలిమినేట‌ర్ మ్యాచ్‌(మే 25)ను నిర్వ‌హిస్తారు.

More Telugu News