Chandrababu: జగన్ జేబు నుంచి ఇచ్చిన డబ్బులతో బతుకుతున్నామా అంటున్న ఆడబిడ్డలకు ఏం సమాధానం చెబుతారు?: చంద్రబాబు

  • కోడుమూరు ఎమ్మెల్యేను చుట్టుముట్టిన మహిళలు
  • ఆ మహిళల ధైర్యానికి వందనం అంటూ చంద్రబాబు పోస్టు 
  • ఎమ్మెల్యేలను సైతం నడిరోడ్డుపై నిలదీస్తున్నారని వెల్లడి
Chandrababu lauds women who questions YCP MLAs

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని మహిళల ఆవేదన ఇలా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పన్నుల బాదుడు, పెంచిన విద్యుత్ చార్జీలపై ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం అంటూ స్పందించారు. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనంపై గళమెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా? అని నిలదీశారు.

జగన్ జేబు నుంచి ఇచ్చారా? అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత? మేం వాటితో బతుకుతున్నామా? అంటున్న ఆడబిడ్డలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

ఈ మేరకు ఓ మహిళ ఆక్రోశం వెలిబుచ్చిన వైనాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. అంతేకాదు, నడిరోడ్డుపై కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ను చుట్టుముట్టిన మహిళలు ఆయనను నిలదీసిన వైనం పత్రికల్లో రాగా, ఆ కథనాన్ని కూడా చంద్రబాబు పంచుకున్నారు.

More Telugu News