Nagachaitanya:  ఆ హీరోతోనే పరశురామ్ నెక్స్ట్ మూవీ!

  • మహేశ్ మూవీని రిలీజ్ కి రెడీ చేసిన పరశురామ్ 
  • ఆ తరువాత  సినిమా నాగచైతన్యతో
  • ఆల్రెడీ రెడీగానే ఉన్న స్క్రిప్ట్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి జరుగుతున్న సన్నాహాలు
Nagachaitanya in Parashuram Movie

'గీత గోవిందం' సినిమాతో పరశురామ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తరువాత సినిమాను ఆయన నాగచైతన్యతో చేయాలనుకున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. 14 రీల్స్ సంస్థవారు ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. అయితే మహేశ్ బాబుతో ప్రాజెక్ట్  అర్జెంట్ కావడంతో, పరశురామ్ ఆ వైపు వెళ్లాడు. 
 
మహేశ్ బాబుతో ఆయన 'సర్కారువారి పాట' సినిమాను పూర్తిచేశాడు. మే 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అలా ఈ లోగా చైతూ కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ' థ్యాంక్యూ' సినిమాను పూర్తి చేశాడు. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఇక పరశురామ్ తరువాత సినిమా చైతూతోనే ఉండనుందని సమాచారం. గతంలో ప్రాజెక్టు వర్క్ మొత్తం రెడీ చేసి ఉన్నందు వలన, ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది. 'గీత గోవిందం' సెంటిమెంట్ కారణంగా ఆమె ఈ సినిమా చేయడం ఖాయమేననే టాక్ వినిపిస్తోంది.    

More Telugu News