L Murugan: ఏపీలో రెండ్రోజుల పాటు పర్యటించనున్న కేంద్ర సహాయ మంత్రి మురుగన్

  • ఈ రాత్రికి విజయవాడ రానున్న మురుగన్
  • రేపు గుంటూరు, నిజాంపట్నంలో పలు కార్యక్రమాలకు హాజరు
  • విశాఖలోనూ పర్యటన.. ఆపై చెన్నై పయనం
L Murugan comes to AP for two day visit

కేంద్ర సమాచార ప్రసార శాఖ, మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఆయన ఈ రాత్రికి విజయవాడ చేరుకుంటారు. రేపు గుంటూరు, నిజాంపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపై విజయవాడ చేరుకుని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. రేపు రాత్రికి రైల్లో విశాఖపట్నం వెళతారు. 

విశాఖ పర్యటనలో భాగంగా ఫిషింగ్ హార్బర్ ను సందర్శిస్తారు. అనంతరం పోర్ట్ ట్రస్ట్ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. అంతేకాదు, మత్స్యకారులు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లబ్దిదారులు, సముద్ర ఆహార ఉత్పత్తిదారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి మురుగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం విశాఖ నుంచి చెన్నై పర్యటనకు వెళతారు.

More Telugu News