Rape And Murder: దుగ్గిరాల మ‌హిళపై అసలు అత్యాచారమే జ‌ర‌గలేదు: కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన గుంటూరు ఎస్పీ

  • హ‌త్యాచారంపై ఎస్పీ వివ‌ర‌ణ‌
  • అత్యాచార‌మే జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డి
  • ఓ వ్య‌క్తితో బాధిత మ‌హిళ‌కు వివాహేత‌ర సంబంధం
  • ఆ వ్య‌క్తి స్నేహితుడే మ‌హిళ‌ను చంపేశాడ‌న్న ఎస్పీ
guntur sp says no rape on duggirala lady

గుంటూరు జిల్లా దుగ్గిరాల‌లో గురువారం వెలుగుచూసిన వివాహితపై హ‌త్యాచారం ఘ‌ట‌న‌కు సంబంధించి కీల‌క వివ‌రాల‌ను గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హ‌ఫీజ్ వెల్ల‌డించారు. అస‌లు వివాహిత‌పై అత్యాచార‌మే జ‌ర‌గలేద‌న్న ఆయ‌న‌... ఆమెతో వివాహేత‌ర సంబంధం క‌లిగిన వెంక‌ట సాయి స‌తీశ్ అనే వ్య‌క్తి మిత్రుడు శివ స‌త్య‌సాయిరాం ఆమెను హ‌త్య చేశాడ‌ని వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో అస‌లు అత్యాచార‌మ‌న్న మాటే లేద‌ని కూడా ఎస్పీ వెల్ల‌డించారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ ఎస్పీ వివ‌రాలు వెల్ల‌డించారు.

ఎస్పీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... బాధిత మ‌హిళ‌తో వెంక‌ట సాయి స‌తీశ్‌కు వివాహేత‌ర సంబంధం ఉంది. ఆమె ఇంటికి అత‌డు త‌ర‌చూ వెళ్లి వ‌స్తుంటాడు. గురువారం అతడు త‌న‌తో పాటు త‌న మిత్రుడు శివ స‌త్య‌సాయిరాంను కూడా ఆమె ఇంటికి తీసుకెళ్లాడు. అయితే శివ‌స‌త్య సాయిరాం కోరిక‌ను తీర్చేందుకు బాధిత మ‌హిళ తిర‌స్క‌రించింది. అంతేకాకుండా ఇలా ఇంకో వ్య‌క్తిని త‌న వ‌ద్ద‌కు తీసుకొచ్చిన‌ట్లుగా వెంక‌ట స‌తీశ్‌పై ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన శివ‌స‌త్య‌సాయిరాం ఆమెను ఆమె చీర‌తోనే ఉరేసి చంపాడు.

More Telugu News