Ramcharan: గౌతమ్ తిన్ననూరి సినిమాపై తేల్చేసిన చరణ్!

  • 'ఆచార్య' ప్రమోషన్లో బిజీగా ఉన్న చరణ్ 
  • శంకర్ సినిమా తరువాత గౌతమ్ మూవీ ఉంటుందంటూ వివరణ 
  • ఇది స్పోర్ట్స్ కి సంబంధించిన కథ కాదంటూ చరణ్ స్పష్టీకరణ
  • హీరోయిన్స్ గా తెరపైకి వచ్చిన రష్మిక .. కృతి పేర్లు
Charan in Goutham movie update

చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, వేగంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సినిమాకి సంబంధించిన ప్రశ్న చరణ్ కి ఎదురైంది.
 
ఇంతకుముందు నానీతో 'జెర్సీ' సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి, తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను సాధించాడు. అదే సినిమాను హిందీలోను రీమేక్ చేశాడు. ఆ తరువాత సినిమాను చరణ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుందనే టాక్ వచ్చింది. 

'ఆచార్య' ప్రమోషన్స్ లో ఇదే ప్రశ్న చరణ్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. ఈ కథ స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించినది కాదు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ డ్రామాగా సాగుతుంది" అంటూ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో కథానాయికలుగా రష్మిక .. కృతి శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. శంకర్ సినిమా తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

More Telugu News