Tollywood: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 'ఆచార్య' చిత్ర బృందం.. వీడియో ఇదిగో

  • ఎల్లుండి సినిమా విడుద‌ల‌
  • గ‌న్న‌వ‌రంలో చిత్ర యూనిట్‌కి అభిమానుల‌ స్వాగ‌తం 
  • కాసేప‌ట్లో ఇంద్ర‌కీలాద్రికి చిత్ర యూనిట్
acharya unit reaches gannavaram

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వడంతో ఆ చిత్ర యూనిట్ సినీ ప్రమోషన్ లలో బిజీగా ఉన్నారు. కాసేప‌ట్లో ఆ సినిమా యూనిట్ విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని సంద‌ర్శించుకోనుంది. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆ సినీ బృందానికి అభిమానులు స్వాగ‌తం ప‌లికారు. 

కాగా, మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాలో రామ్‌చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎల్లుండి థియేటర్లలోకి రానుంది.

More Telugu News