YSRCP: 28న విశాఖ టూర్‌కు జ‌గ‌న్‌... భారీ సంఖ్య‌లో ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల‌ ప‌ట్టాల పంపిణీ

  • విశాఖ న‌గ‌ర శివారులో ఒకే చోట 72 లే అవుట్లు
  • 300 ఎక‌రాల విస్తీర్ణంలో 9 వేల మందికి ఇళ్ల స్థ‌లాలు
  • సీఎం ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు పూర్తి
ap cm ys jagan tours vizag on 28th

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 28న విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఈ సంద‌ర్భంగా వేలాది మంది ల‌బ్ధిదారుల‌కు ఆయ‌న ఇళ్ల ప‌ట్టాలు అందించ‌నున్నారు. ఈ మేర‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. విశాఖ న‌గ‌ర శివారులో ఒకేచోట 72 లే అవుట్ల‌ను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 300 ఎకరాల మేర విస్తీర్ణంలో 9 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయించారు. ఈ ఇళ్ల స్థ‌లాల పట్టాల‌ను వాటి ల‌బ్ధిదారుల‌కు జ‌గ‌న్ పంపిణీ చేయ‌నున్నారు.

More Telugu News