Andhra Pradesh: కరోనా వచ్చిన తర్వాత తొలిసారి.. ఏపీలో సున్నా కరోనా కేసులు!

  • గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం
  • ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న 12 మంది రోగులు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22
AP registers zero corona cases

ఏపీలో కరోనా పూర్తి కట్టడిలోకి వచ్చింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతి రోజు కొత్త కేసులు నమోదవుతూనే వచ్చాయి. తొలిసారి నిన్న సున్నా కేసులు నమోదయ్యాయి. 2020 మార్చి 9న ఏపీలో తొలి కేసు నమోదయింది. కరోనా ఉద్ధృతంగా ఉన్న ఓ దశలో ఒక్క రోజులోనే దాదాపు 24 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 2,163 మంది శాంపిల్స్ ను పరీక్షించగా.. ఒక్కరికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ కాలేదు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 23,19,662గా ఉంది. నిన్న మరో 12 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం ఏపీలో 22 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరూ ఇలాగే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏపీని కరోనా ఫ్రీ రాష్ట్రంగా మార్చొచ్చని వైద్యాధికారులు అంటున్నారు.

More Telugu News