Andhra Pradesh: ఏపీలో తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్

  • ఏపీలో అత్యంత క్షీణ దశకు కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 2,870 కరోనా పరీక్షలు
  • కృష్ణా జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 1 కేసు నమోదు
Two people tested corona positive in AP

ఏపీలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. గత కొన్నిరోజులుగా గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాజాగా రాష్ట్రంలో 2,870 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో ఇద్దరు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మృతి చెందారు.
.

More Telugu News