Andhra Pradesh: ఏపీలో తాజాగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 3,030 కరోనా పరీక్షలు
  • నాలుగు జిల్లాల్లో ఒక్కొక్క కేసు
  • కరోనా నుంచి కోలుకున్న ఆరుగురు
  • తాజా మరణాలు నిల్
Only four corona positive cases in AP

ఏపీలో గడచిన 24 గంటల్లో 3,030 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 4 పాజిటివ్ కేసులు మాత్రమే వెల్లడయ్యాయి. కాకినాడ జిల్లాలో 1, ఎన్టీఆర్ జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో ఆరుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటిదాకా ఏపీలో కరోనాతో 14,730 మంది మృతి చెందారు.

More Telugu News