IPL 2022: టాస్ గెలిచిన చెన్నై... తొలి ఓవ‌ర్‌లోనే రోహిత్, ఇషాన్‌ అవుట్‌

  • ఓపెన‌ర్లిద్ద‌రూ డ‌క్ అవుట్‌
  • ముఖేశ్ చౌద‌రి స‌త్తా చాటిన వైనం
  • రెండు ఓవ‌ర్ల‌లో ముంబై స్కోరు 14
csk wins toss and mi loses 2 wickets

ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో భాగంగా రెండు కీల‌క జ‌ట్లు చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య కాసేప‌టి క్రితం మ్యాచ్ ప్రారంభ‌మైంది. ముంబైకి చావో రేవో అన్న నేప‌థ్యంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై...ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

ఈ క్ర‌మంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి తొలి ఓవ‌ర్‌లోనే షాక్ ఎదురైంది. ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తొలి ఓవ‌ర్ రెండో బంతికే డ‌క్ అవుట్ అయ్యాడు. ఆ వెంట‌నే మ‌రో స్టార్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ కూడా తొలి ఓవ‌ర్ ఐదో బంతికే డ‌క్‌ అవుట‌య్యాడు. అలా వీరిద్ద‌రూ ప‌రుగులేమీ చేయ‌కుండానే వెనుదిర‌గ‌డంతో ముంబై క‌ష్టాల్లో ప‌డిపోయింది. ప్ర‌స్తుతం క్రీజులో సూర్య‌కుమార్ యాద‌వ్ (9), డేవిడ్ బ్రావిస్(4) ఉన్నారు. 

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టిదాకా ఖాతానే తెర‌వని ముంబై క‌నీసం ఈ మ్యాచ్‌లో అయినా విజ‌యం సాధిస్తుందా? అని ఆ జ‌ట్టు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు ప‌రుగులేమీ చేయ‌కుండానే వెనుదిర‌గ‌డంతో అభిమానులు షాక్‌ తిన్నారు. ప్ర‌స్తుతం రెండు ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై 2 వికెట్ల న‌ష్టానికి 14 ప‌రుగులు చేసింది. తొలి ఓవర్ వేసిన చెన్నై బౌలర్ ముఖేశ్ చౌదరి ఒకే ఓవర్ లో ఏకంగా 2 వికెట్లు తీసి సత్తా చాటాడు.

More Telugu News