Mahesh Babu: 'సర్కారువారి పాట' నుంచి టైటిల్ సాంగ్ రెడీ!

  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'
  • మహేశ్ సరసన నాయికగా కీర్తి సురేశ్
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • ఈ నెల 23న టైటిల్ సాంగ్ రిలీజ్   
  • మే 12వ తేదీన సినిమా విడుదల 
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరిపాట చిత్రీకరణను పూర్తిచేసే పనిలో ఈ సినిమా టీమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకి స్వరాలను అందించాడు. 
 
ఇంతవరకూ బయటికి వచ్చిన 'కళావతి' ..  'పెన్నీ' పాటలు రికార్డుస్థాయి వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను వదలడానికి టీమ్ రెడీ అయింది. ఈ నెల 23వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

ఈ పాట ఒక రేంజ్ లో అదిరిపోతుందని తమన్ ముందుగానే మహేశ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. కీర్తి  సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సముద్రఖని కీలకమైన పాత్రను పోషించాడు. మే 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ ప్రాజెక్టుపైకి మహేశ్ వెళ్లనున్నాడనే విషయం తెలిసిందే.

More Telugu News