Telangana: రంగురంగుల క్యాప్సికం... ఆస‌క్తిగా ప‌రిశీలించిన మంత్రి హ‌రీశ్ రావు

  • సంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న హ‌రీశ్ రావు
  • రేజింతల్‌లోని అత్యాధునిక పాలీ హౌస్‌ను సందర్శించిన వైనం
  • రంగురంగుల క్యాప్సికం సాగుపై ఆరా తీసిన మంత్రి
harish rao visits poly house in rejinthal of sangareddy

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు గ‌డ‌చిన రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రెండో రోజైన మంగ‌ళ‌వారం ఆయ‌న సంగారెడ్డి ప‌రిధిలోని రేజింత‌ల్ గ్రామంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక పాలీహౌస్ ను సందర్శించారు. స‌ద‌రు పాలీహౌస్‌లో రంగురంగుల క్యాప్సికంతో పాటు గెర్కీన్‌ను సాగు చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా రంగు రంగుల్లో ఉన్న క్యాప్సికంల‌ను చేతిలోకి తీసుకున్న హ‌రీశ్ రావు వాటిని ఆస‌క్తిగా పరిశీలించారు. ఆ త‌ర్వాత వాటి సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్, ఆదాయం వంటి వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News