Telangana: తెలంగాణలో తాజాగా 11 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 9,546 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 9 కొత్త కేసులు
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2 కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 29 మంది
  • ఇంకా 222 మందికి చికిత్స
Corona daily bulletin of Telangana

తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా పరీక్షల సంఖ్య కూడా తగ్గింది. గడచిన 24 గంటల్లో 9,546 శాంపిల్స్ పరీక్షించగా, 11 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులోనే 9 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో రెండు కేసులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 

అదే సమయంలో 29 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,630 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,313 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 222 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

More Telugu News