YSRCP: రేపు తిరుప‌తిలో వైసీపీ జాబ్ మేళా.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన విజయసాయిరెడ్డి

  • ఎస్వీ వ‌ర్సిటీలో రెండు రోజుల పాటు జాబ్ మేళా
  • 137 కంపెనీలు వ‌స్తున్న‌ట్లు వైసీపీ ప్ర‌క‌ట‌న‌
  • ఇప్ప‌టికే 1.34 ల‌క్ష‌ల మంది రిజిస్ట్రేష‌న్‌
ysrcp job mela in tirupati from tomorrow

ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతృత్వంలో మెగా జాబ్ మేళా జ‌ర‌గ‌నుంది. తిరుప‌తి కేంద్రంగా జ‌ర‌గ‌నున్న ఈ జాబ్ మేళాలో నిరుద్యోగుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించేందుకు ఏకంగా 137 కంపెనీలు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు తిరుప‌తిలోని శ్రీవెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీలో జాబ్ మేళా నిర్వ‌హ‌ణ కోసం జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి శుక్ర‌వారం ప‌రిశీలించారు.

రెండు రోజుల పాటు ఈ జాబ్ మేళాను నిర్వ‌హించ‌నున్నారు. వైసీపీ నుంచి వ‌చ్చిన ప్ర‌క‌ట‌న మేర‌కు ఈ జాబ్ మేళాకు హాజ‌ర‌య్యేందుకు ఇప్ప‌టికే 1.34 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు త‌మ పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేయించుకున్నారు. ఇంకా రిజిస్ట్రేష‌న్‌కు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో మ‌రింత మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయి.

More Telugu News