TDP: దళితులను జగన్ లిఫ్ట్‌లోకి ఎక్కనివ్వ‌లేదు: వ‌ర్ల రామ‌య్య ఆరోప‌ణ‌

  • ద‌ళితుల ఓట్ల‌తో జగన్ ‌గెలిచారన్న రామయ్య 
  • అదే ద‌ళితుల‌పై దాడులు చేయిస్తున్నారని ఆరోపణ 
  • జ‌గ‌న్ అంట‌రాని త‌నాన్ని పాటించే నేత‌న్న వ‌ర్ల‌
varla ramaiah comernts on ap cm ys jagan

టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ద‌ళిత, బ‌డుగు, బ‌ల‌హీన వర్గాల‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని చెబుతున్న జ‌గ‌న్‌... ద‌ళితుల‌ను క‌నీసం త‌న వెంట లిఫ్ట్ కూడా ఎక్క‌నివ్వ‌డం లేదంటూ వ‌ర్ల రామ‌య్య వ్యాఖ్యానించారు. గురువారం నాడు రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలో ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడులు, అవ‌మానాల‌పై వ‌ర్ల రామ‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ద‌ళితుల ఓట్ల‌తో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ద‌ళితుల‌పైనే దాడులు చేయిస్తున్నార‌ని వ‌ర్ల ఆరోపించారు. అబద్ధాల‌తో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ద‌ళితుల‌ను లిఫ్ట్‌లోకి కూడా ఎక్క‌నివ్వ‌డం లేదని ఆయ‌న ఆరోపించారు. అంట‌రానిత‌నాన్ని పాటించే జ‌గ‌న్‌కు ద‌ళితుల‌ను అక్కున చేర్చుకునే చంద్ర‌బాబుతో పోలికా? అంటూ వ‌ర్ల ప్ర‌శ్నించారు.

More Telugu News