Sensex: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • మార్కెట్లను వెనక్కి లాగిన ఐటీ స్టాకులు
  • 388 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 144 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in loses

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాకులు మార్కెట్లను వెనక్కి లాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 388 పాయింట్లు కోల్పోయి 58,576కి పడిపోయింది. నిఫ్టీ 144 పాయింట్లు పతనమై 17,530 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (1.60%), కోటక్ బ్యాంక్ (1.21%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.82%), మారుతి (0.60%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.59%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.76%), విప్రో (-2.16%), టెక్ మహీంద్రా (-2.12%), భారతి ఎయిర్ టెల్ (-2.06%), రిలయన్స్ (-1.90%).

More Telugu News