SRH: ఐపీఎల్: గుజరాత్ పై టాస్ నెగ్గిన సన్ రైజర్స్

  • ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • గత మ్యాచ్ లో విజయవంతమైన ఛేజింగ్
  • మరోసారి ధీమాతో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్
Sunrisers won the toss and elected bowling

ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబయిలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ నెగ్గిన సన్ రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లోనూ ఇదే పంథాలో లక్ష్యఛేదన చేసిన సన్ రైజర్స్ మరోసారి అదే వ్యూహానికి కట్టుబడ్డారు. 

మరి ఈ టోర్నీలో ఓటమి ఎరుగని గుజరాత్ తో మ్యాచ్ లో ఏంచేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టులో ఎలాంటి మార్పుల్లేవు. అటు, గుజరాత్ టైటాన్స్ కూడా అదే జట్టుతో బరిలో దిగుతున్నట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.

More Telugu News