Andhra Pradesh: పాదాభివందనం చేసి.. చేతులు ముద్దాడి.. కొత్త మంత్రుల విధేయత

  • జగన్ చెయ్యిని ముద్దాడిన రోజా
  • పాదాభివందనం చేసిన అమర్ నాథ్, జోగి రమేశ్
  • ఏపీ సీఎంపై విధేయతను చాటిన కొత్త మంత్రులు
AP New Ministers Shows Their Loyalty On Cm Jagan

ఏపీ కొత్త మంత్రులు సీఎం జగన్ పట్ల తమ విధేయత చాటుకున్నారు. ఇలా ప్రమాణం చేశారో లేదో.. అలా వెళ్లి జగన్ కు పాదాభివందనం చేశారు. ప్రమాణం అనంతరం కొందరు గవర్నర్ బిశ్వభూషణ్ , సీఎం జగన్ కు నమస్కరించి వెళ్లిపోగా.. కొందరు మాత్రం పాదాభివందనం చేశారు.  

మంత్రి నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్ జగన్ పాదాలకు నమస్కారం చేశారు. గుడివాడ అమర్ నాథ్, జోగి రమేశ్ లు ఇంకాస్త ఎక్కువగా తమ విధేయతను చూపించారు. మోకాళ్లమీద వంగి కాళ్లకు నమస్కరించారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రోజా జగన్ వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కారు. ఆయన చేతినీ ముద్దాడారు. ఇలా ఎవరికివారు జగన్ పై తమకున్న విధేయతను చాటుకున్నారు.

More Telugu News