Telangana: భైంసా శోభాయాత్ర‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌.. పాటించాల్సిన ష‌ర‌తులివే!

  • శ్రీరామ న‌వమి సంద‌ర్భంగా భైంసా శోభాయాత్ర‌
  • డీజే మ్యూజిక్ వాడ‌రాద‌న్న హైకోర్టు
  • 200 మందికి మించి పాల్గొన‌రాద‌ని ఆంక్ష‌లు
ts high court issued green signal to Bhainsa shobha yatra

శ్రీరామ న‌వమి సంద‌ర్భంగా భైంసాలో వేడుక‌గా జ‌రిగే శోభా యాత్ర‌కు ఎట్ట‌కేల‌కు తెలంగాణ హైకోర్టు అనుమ‌తులు మంజూరు చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం నాడు యాత్ర‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

యాత్ర‌లో డీజే మ్యూజిక్ బ్యాండ్‌ను వాడ‌రాద‌ని ఆంక్ష‌లు విధించింది. అంతేకాకుండా ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌లోగా యాత్ర‌ను ముగించాల‌ని పేర్కొంది. ఇక యాత్ర‌లో 200 మందికి మించి పాల్గొన‌రాద‌ని కూడా హైకోర్టు ష‌ర‌తు విధించింది.

More Telugu News