Telangana: తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 16,610 కరోనా పరీక్షలు
  • 35 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 28 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 31 మంది
  • ఇంకా 248 మందికి చికిత్స
Telangana daily corona cases bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,610 కరోనా పరీక్షలు నిర్వహించగా, 35 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 28 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 3, ఆదిలాబాద్ జిల్లాలో 1, మంచిర్యాల జిల్లాలో 1, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో 36 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,91,461 మంది కరోనా బారినపడగా, వారిలో ఇప్పటివరకు 7,87,102 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 248 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.

More Telugu News