Amaravati: ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో అమ‌రావ‌తి రైతుల భేటీ... అండ‌గా ఉంటామ‌న్న ఎంపీలు

  • ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో అమ‌రావ‌తి రైతులు
  • టీడీపీ ఎంపీల‌తో ప్ర‌త్యేక భేటీ
  • ఉద్య‌మం, ప్ర‌భుత్వ తీరుపై ఎంపీల‌కు వివ‌రించిన రైతులు
  • ఉద్య‌మానికి అండ‌గా ఉంటామ‌ని టీడీపీ ఎంపీల ప్ర‌కట‌న‌
amaravati farmers met tdp mps in delhi

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు బుధ‌వారం నాడు టీడీపీ ఎంపీల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం తాము సాగిస్తున్న ఉద్య‌మం గురించి రైతులు ఎంపీల‌కు వివ‌రించారు. ఏపీ ప్ర‌భుత్వం త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రిని కూడా ఎంపీల‌కు రైతులు వివ‌రించారు. 

అమరావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం సాగుతున్న రైతుల ఉద్య‌మానికి తాము ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటామ‌ని ఈ సంద‌ర్భంగా టీడీపీ ఎంపీలు ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం దిగివ‌చ్చేదాకా ఉద్య‌మాన్ని కొన‌సాగించాల‌ని కూడా ఎంపీలు రైతుల‌కు సూచించారు. అమ‌రావ‌తికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినా... జ‌గ‌న్ స‌ర్కారు మొండిగా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌ని ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

More Telugu News