Twitter: ట్విట్ట‌ర్ డైరెక్ట‌ర్ల బోర్డులోకి ఎలాన్ మ‌స్క్‌

  • ట్విట్ట‌ర్‌లో 9.2 శాతం వాటా క‌లిగిన మ‌స్క్
  • ఈ విష‌యం వెల్ల‌డితో దూసుకుపోయిన ట్విట్ట‌ర్ షేర్ 
  • తాజాగా మ‌స్క్‌కు డైరెక్ట‌ర్ల బోర్డులోకి ట్విట్ట‌ర్ ఆహ్వానం
Elan musk got the seat in twitter directors board

వాణిజ్య రంగంలో మంగ‌ళ‌వారం నాడు మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్... సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్ డైరెక్ట‌ర్ల బోర్డులోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ సంస్థ‌ను ఉటంకిస్తూ ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ద అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

ట్విట్ట‌ర్‌లో ఎలాన్ మ‌స్క్ 9.2 శాతం షేర్ల‌ను కొనుగోలు చేసిన‌ట్లుగా సోమ‌వారం ఓ వార్త వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌టంతో ట్విట్ట‌ర్ షేర్ ధ‌ర ఒక్క‌రోజులోనే 26 శాతం మేర పెరిగిన విష‌య‌మూ విదిత‌మే. తాజాగా త‌మ సంస్థ‌లో 9 శాతానికి పైగా వాటా క‌లిగిన ఎలాన్ మ‌స్క్‌కు త‌మ డైరెక్ట‌ర్ల బోర్డులో చోటు క‌ల్పించ‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్ పేర్కొంది.

More Telugu News