Pushpasreevani Pamula: కన్నీళ్లు ఆగడంలేదు అమ్మా... ఈ లోకంలో లేని తల్లి కోసం ఏపీ డిప్యూటీ సీఎం అశ్రు నివాళి

  • మూడేళ్ల కిందట పుష్ప శ్రీవాణికి మాతృవియోగం
  • ఇప్పటికీ వేదనలో డిప్యూటీ సీఎం
  • దేవుడికి దయ లేదంటూ వ్యాఖ్యలు
Pamula Pushpa Srivani tearful tribute her late mother

ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మూడేళ్ల కిందట తల్లిని కోల్పోయారు. ఇప్పటికీ తాను మాతృమూర్తి జ్ఞాపకాలతో తీవ్ర వేదనకు గురవుతున్నానని తాజాగా పుష్ప శ్రీవాణి సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు తల్లికి కన్నీటి నివాళి అర్పించారు. 

"అమ్మా... నీ స్పర్శ నాకు దూరమై మూడు సంవత్సరాలు గడిచిపోయింది. అమ్మా... మా కోసం మళ్లీ వచ్చేయ్ అమ్మా! ఎన్ని ఉన్నా నాకు నువ్వు లేవు అని గుర్తొస్తే కన్నీళ్లు ఆగడంలేదు. ఆ దేవుడు కూడా మాకోసం ఆలోచించలేదు. నువ్వు లేకపోతే ఉండలేం అని తెలిసి కూడా దూరం చేశాడు. ఆ భగవంతుడికి బహుశా మమ్మల్ని చూసి జాలి కలగలేదేమో! నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆశీర్వాదాలు మాపై ఉంటాయని నమ్ముతున్నాను... నీ వాణమ్మ" అంటూ బరువెక్కిన హృదయంతో ట్వీట్ చేశారు. ఈ మేరకు తన తల్లితో కలిసున్న ఫొటోను కూడా పుష్ప శ్రీవాణి పంచుకున్నారు.
.

More Telugu News