Telangana: తెలంగాణలో 17 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

  • గత 24 గంటల్లో 15,675 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 12 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 36 మంది
  • ఇంకా 271 మందికి చికిత్స
Telangana corona bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 15,675 కరోనా పరీక్షలు నిర్వహించగా, 17 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 12 కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 3, కరీంనగర్ జిల్లాలో 1, నిర్మల్ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 36 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,345 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,963 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 271 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

More Telugu News