Ugadi: తాడేప‌ల్లిలో ఉగాది వేడుక‌లు.. స‌తీస‌మేతంగా హాజ‌రైన సీఎం జ‌గ‌న్‌

  • తాడేప‌ల్లిలో ఉగాది వేడుక‌లు
  • హాజ‌రైన సీఎం జ‌గ‌న్ దంప‌తులు
  • పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న వైసీపీ నేత‌లు
ap cm ys jagan allends ugadi celebratikons in tadepalli

తెలుగు సంవ‌త్స‌రాది ఉగాదిని పుర‌స్క‌రించుకుని ఏపీలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున అధికారిక వేడుక‌లు కాసేప‌టి క్రితం ప్రారంభ‌మ‌య్యాయి. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన వేదిక‌పై ప్రారంభ‌మైన ఈ వేడుక‌ల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. త‌న అర్ధాంగి వైఎస్ బార‌తితో క‌లిసి హాజ‌ర‌య్యారు. తెలుగు సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో క‌నిపించిన సీఎం దంప‌తులు అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

వేడుక‌ల్లో భాగంగా త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి విగ్ర‌హానికి నివాళి అర్పించారు. ఆ త‌ర్వాత అక్క‌డికి చేరుకున్న‌ చిన్నారుల‌తో ముచ్చ‌టించిన జ‌గ‌న్‌.. పంచాంగ శ్ర‌వ‌ణంలో పాలుపంచుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీకి చెందిన కీల‌క నేత‌లు, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

More Telugu News