Anantapur District: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురి మృతి

  • జిల్లాలోని మిడుతూరు వద్ద ఘటన
  • ఆగివున్న లారీని ఢీకొన్న బస్సు
  • బెంగళూరు నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం
  • మరో 15 మందికి తీవ్ర గాయాలు
3 dead and 15 injured in a road accident in anantapur district

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఆగి వున్న లారీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో లారీలో ఉన్న ఇద్దరు, బస్సులోని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News