Chiranjeevi: 'మిషన్ ఇంపాజిబుల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా చిరంజీవి

  • స్వరూప్ ఆర్ఎస్ జే దర్శకత్వంలో చిత్రం
  • రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హైదరాబాదులో కార్యక్రమం
  • ఏప్రిల్ 1న వస్తున్న మిషన్ ఇంపాజిబుల్
  • కీలకపాత్రలో తాప్సీ
Chiranjeevi will attend Mishan Impossible movie pre release event

ముగ్గురు బాలలు ప్రధాన పాత్రధారులు కాగా, తాప్సీ కీలక పాత్రలో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (మార్చి 30) హైదరాబాదులో జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాదు వెస్టిన్ హోటల్ లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

కాగా, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టిన స్వరూప్ ఆర్ఎస్ జే ఈ సినిమాకు దర్శకుడు. అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే డబ్బులు ఇస్తారన్న ఆలోచనతో ముగ్గురు చిన్నారులు ఏంచేశారన్నది ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది. బాలనటులు రోషన్, జైతీర్థ, భానుప్రకాశ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

More Telugu News