Chandrababu: హైదరాబాదులో 'నేను-తెలుగుదేశం' పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

  • పుస్తకాన్ని రచించిన కంభంపాటి రామ్మోహన్ రావు
  • 40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంపై పుస్తకం
  • కార్యక్రమానికి హాజరైన వివిధ రంగాల ప్రముఖులు
Chandrabau launches Nenu Telugudesam book

టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన 'నేను-తెలుగుదేశం' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం హైదరాబాదులో జరిగింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

కాగా, తన పుస్తకంపై కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ... ఈ పుస్తకం కోసం రెండేళ్లు హోమ్ వర్క్ చేశానని వెల్లడించారు. 'ఎన్టీఆర్ ఏది చెబితే అది చేయడమే నాకు తెలుసు' అని వివరించారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని కొనియాడారు. కాగా, ఈ పుస్తకావిష్కరణ సభలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీడీపీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

More Telugu News