PM Modi: భాకరాపేట బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందన... మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

  • గతరాత్రి చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
  • భాకరాపేట వద్ద లోయలో పడిపోయిన బస్సు
  • 8 మంది మృతి
  • పలువురికి గాయాలు
  • విచారం వ్యక్తం చేసిన మోదీ
PM Modi reacts to Bhakarapeta bus accident

నిశ్చితార్థం కోసం ధర్మవరం నుంచి తిరుచానూరు వెళుతూ ఓ బస్సు చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద లోయలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్టు వెల్లడించారు. అటు ఏపీ సీఎం జగన్ కూడా పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News