Ajith: అవును .. 'వలిమై' 200 కోట్లకి పైగా వసూలు చేసింది!: బోనీకపూర్

  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'వలిమై'
  • అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి 
  • ప్రతినాయకుడిగా కార్తికేయ 
  • రేపటి నుంచి జీ 5లో స్ట్రీమింగ్
valimai movie update

అజిత్ హీరోగా ఇటీవల 'వలిమై' సినిమా వచ్చింది. సిహెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, తొలి మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఒక్క తమిళనాట తప్ప మితగా భాషలలో ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేకపోయింది. 

అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి నటించగా, ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు దక్కించుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా 200 కోట్లకి పైగా వసూలు చేసిందనే టాక్ నడుస్తోంది. అయితే చాలామంది అందులో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు. 

ఈ సినిమా తొలి మూడు రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ, ఆ తరువాత వసూళ్లు డ్రాప్ అవుతూ వచ్చాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమ సినిమా 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిందని బోనీ కపూర్ ట్వీట్ చేసి, పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. వినోద్ .. బోనీ కపూర్ కాంబినేషన్లోనే అజిత్ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు.

More Telugu News